Monday, April 29, 2024

ఇది రైతుల విజయం.. కేసీఆర్ కూడా దిగిరాక తప్పదు: రేవంత్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడంపై దేశ రైతాంగానికి అభినందనలు తెలిపారు.  నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కుతగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయంగా అభివర్ణించారు.- దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్ర చేస్తే ఎంతటి నియంతైనా దిగిరాకతప్పదు అనడానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయం అని చెప్పారు.- ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు అవి తునాతునకలయ్యాయి అని చెప్పారు.

కేంద్రం ముందే కళ్లు తెరిచి ఉంటే ఉద్యమంలో వందల మంది రైతుల ప్రాణాలు పోయేవి కాదని అన్నారు.- దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కూడా దిగిరాక తప్పదన్నారు. కల్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమంతో కేసీఆర్ అహంకారాన్ని అణుచుతామని చెప్పారు. ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement