Friday, May 10, 2024

పెళ్లి బరాత్‌లో ఘర్షణ, కాల్పులు.. వధువు సోదరి మృతి

ఓ చిన్న ఘర్షణ… కాల్పుల చేసుకునే వరకు వెళ్లి పెళ్లింట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. మరికొద్ది సమయంలో వధూవరులిద్దరూ పెళ్లితంతుతో ఒక్కటి కాబోతున్న సమయంలో ఇరు కుటుంబాల సభ్యులు సంతోషంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకున్నారు. వాయిద్య బృందంపై రంగులు పడ్డాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో వధువు సోదరి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అదనపు బలగాలను మొహరించారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎటా జిల్లా ఎస్పీ ఉదయ్‌ శంకర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement