Thursday, May 2, 2024

వ‌రిధాన్యం కొనుగోళ్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి : లోక్ స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి తెలపాలని తెలంగాణ రైతాంగం తరుపున లోక్ సభ వేదికగా కేంద్రంపై సహచర ఎంపీలతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్ సభలో గ‌త రెండు రోజులు నిర‌స‌న తెలుప‌గా.. ఇవాళ‌ మూడవ రోజు కూడా టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఫ్లకార్డుల ప‌ట్టుకొని ప్రదర్శన చేశారు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని నినాదాలు చేస్తూ…ఎంపీలు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement