Thursday, April 25, 2024

ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ.. ఏపీ హైకోర్టులో విచారణ

ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడుదల రజని, జక్కంపూడి రాజా, అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపై.. క్రిమినల్ కేసుల ఉపసంహరణపై సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. సుప్రీం తీర్పు మేరకు ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై విచారణ నిర్వహించింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. కేసుల ఉపసంహరణకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో రిపోర్టు ఇవ్వాలని.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement