Sunday, April 28, 2024

కొరియోగ్రాఫర్ రాకేశ్​ మాస్టర్​ ఇక లేరు.. చికిత్సపొందుతూ కన్నుమూత​

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేశ్​ మాస్టర్ ఇవ్వాల (ఆదివారం) చనిపోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు సన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో బ్లడ్​ మోషన్స్​ అయినట్టు సమాచారం. ఆ వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు.

- Advertisement -

ఆట డ్యాన్స్ షోతో రాకేష్ మాస్టర్ తన కెరీర్ ను డ్యాన్సర్ గా మొదలుపెట్టారు. అక్కడ నుంచి డ్యాన్స్ మాస్టర్ గా.. దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తన కెరీర్ ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేసారని తెలిపే వీడియోతో యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాడు.

ఇక.. రాకేశ్​ మాస్టర్​ మాట్లాడిన ప్రతి మాట వైరల్ గా మారింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆట షో గురించి, డ్యాన్స్ షోల గురించి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండడటంతో రాకేష్ మాస్టర్ కు మతిస్థితిమితం లేకపోవడం వలనే ఇలా మాట్లాడుతున్నాడు అని రూమర్స్ పుట్టించారు. ప్రస్తుతం ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement