Monday, April 29, 2024

రంగ‌మార్తాండ కోసం.. రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి

రంగ‌మార్తాండ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి షాయ‌రీ..క‌వితాఝరిని అందించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని డైరెక్టర్ కృష్ణవంశీ వెల్ల‌డించారు. స్నేహితులు, శ్రేయోభిలాషులకు హాయ్‌.. చాలా కాలంగా ఉన్న ఎదురుచూపులకు శుభం పడనుంది. గర్వంగా సమర్పిస్తున్నా..నా సినిమా రంగమార్తాండ కోసం అన్నయ్య షాయరీ.. మీరంతా ఇష్టపడతారని ఆశిస్తున్నానని ట్వీట్ చేస్తూ.. చిరు కవితాఝరి పలుకుతున్న స్టిల్‌ను షేర్ చేశారు కృష్ణవంశీ. నేనొక నటుడిని అంటూ సాగే షాయరీని డిసెంబర్‌ 21న ఉదయం 11 : 07 గంటలకులాంఛ్ చేస్తున్నట్టు కృష్ణవంశీ ప్రకటించాడు.

ఇప్పటికే రంగమార్తాండ సినిమాకు సంబంధించి విడుదలైన ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగ్స్‌, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్‌ డబ్బింగ్‌ వీడియోలు, స్టిల్స్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌-రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement