Friday, May 17, 2024

‘మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి’ సినిమాపై చిరు ప్ర‌శంస‌ల వ‌ర్షం..

మహేశ్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో అనుష్క‌, న‌వీన్ పొలిశెట్టి హీరో-హీరోయిన్లుగా న‌టించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి’. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 7న థియేట‌ర్ల‌లో రిలీజ్ కి సిద్దంగా ఉంది. కాగా, ఈ సినిమాను మెగా స్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా వీక్షించారు. అనుష్క‌, న‌వీన్ పొలిశెట్టి, డైరెక్ట‌ర్ మ‌హేష్‌బాబుతో పాటు చిత్ర యూనిట్‌పై చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు.

సినిమా యూనిట్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను చిరంజీవి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ” ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేశ్ బాబుని అభినందించాల్సిందే” అని అన్నారు చిరంజీవి.

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టికి తొలి ప్రేక్ష‌కుడిని తానే అంటూ ఫ‌న్నీగా ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నాడు. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదని చిరంజీవి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement