Tuesday, May 14, 2024

Donation | జనసేనకు చిరంజీవి రూ.ఐదు కోట్ల విరాళం

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం పిఠాపురం నియోజకవర్గం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ త‌రుణంలో శివార్లలోని ముచ్చింతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ కు వెళ్లాడు. మరో సోదరుడు నాగబాబుతో కలిసి లొకేషన్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు.

ఆ సమయంలో చిరంజీవి స్వయంగా ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని తన సోదరుడికి చెక్కు రూపంలో అందజేశారు. అన్న చేతుల మీదుగా చెక్కు తీసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆయన కాళ్లకు మొక్కారు. పాదాబివందనం చేసుకుని హత్తుకున్నారు. చిరంజీవి ఆశీస్సులు అందుకున్న పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.

పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. చిరంజీవి తమ పార్టీకి రూ.5 కోట్లు విరాళం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి జనసేన నాయకులు, సైనికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మెగా బ్రదర్స్ ఇలాంటి ఫ్రేమ్‌లో కనిపించడంతో సినీ అభిమానులతో పాటు సామాన్య జనం కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా వాయిదా పడిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం త్వరలో పునఃప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ తదుపరి టూర్ షెడ్యూల్ ఖరారు చేసే పనిలో జనసైనికులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement