Thursday, May 16, 2024

కరోనా కష్టకాలంలో భారత్‌కు చైనా ఆపన్న హస్తం

కరోనా కారణంగా అల్లాడిపోతున్న భారత్‌కు పలు దేశాలు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నాయి. ఆ దేశాల జాబితాలో తాజాగా చైనా కూడా చేరింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అదే కోవలో భారత్‌కు 800 ఆక్సిజన్ కాన్‌సన్ ట్రేటర్లను పంపించింది. ఇంకో వారంలో మరో 10 వేల కాన్ సన్ ట్రేటర్లను పంపించనుంది. దేశంలో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అయిపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను తరలించేందుకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement