Saturday, April 27, 2024

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కీలక బాధ్యతలు.. యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీలో స్థానం

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డికి కీలక బాధ్యతలు అందాయి. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్టప్రతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన త‌ర్వాత ప్ర‌చార క‌మిటీలో రంజిత్‌రెడ్డికి చాన్స్ ద‌క్కింది. ఈ కార్యక్రమానికి టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రచార కమిటీలో 11 మందికి అవ‌కాశం కల్పించారు.

టీఆర్ ఎస్ తరఫున చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పేరు పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌ప‌జ్ చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అయిన‌ యశ్వంత్ సిన్హాకు దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. దేశంలో ఎక్కడికి ప్రచారానికి వెళ్లిన కమిటీ సభ్యులు వెళ్లాల్సి ఉంటుంది. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. కమిటీలో స్థానం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు… యువనేత కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. యశ్వంత్ సిన్హా విజయానికి తమవంతు కృషి చేస్తామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement