Saturday, May 4, 2024

TS | వికారాబాద్ జిల్లాలో తరచుగా చిరుతల కలకలం..!

వికారాబాద్ టౌన్, (ప్రభన్యూస్) : వికారాబాద్ జిల్లా పరిధిలోని వారం రోజుల క్రితం పూడూరు మండలం గుండం అటవీ ప్రాంతంలో చిరుత లేగ దూడలు చంపి తిన్న విషయం బయటపడింది. అడవి శాఖ వారు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో కనిపించడం జరిగింది. అనంతరం రెండు రోజుల క్రిందట అనంతగిరి అడవిలో రోడ్డు మార్గాన వెళ్తున్న వాహనాల వారికి చిరుత కనిపించిందని అటవీ శాఖ వారికి తెలియచేసినారు.

తాజాగా గురువారం గోధుమ గూడా మేకల కాపరి మేకల గుంపు నుండి ఓ మేకను చిరుతనే ఎత్తుకెళ్లినట్లు మేకల యజమాని ఆందోళన చెందుతూ పేర్కొన్నాడు. విశ్వాసనీయ సమాచారం మేరకు మదనపల్లి, మన్నెగూడ సమీపం కూడా చిరుతలు కనిపించినట్లు తెలుస్తుంది. ఇట్టి విషయంలో అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ చిరుతలు నిజమేనా ఓకే తిరుగుతుందా అటు ఇటు సంచారిస్తుందా అనే విషయం తేల్చలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement