Thursday, April 25, 2024

చిట్ ఫండ్ ల పేరుతో ఛీటింగ్… శుభనందిని హోమ్స్ ముందు ధర్నా..

హనుమకొండ గోపాలపూర్, జవహర్ నగర్ కాలనీలో శుభనందిని హోమ్స్ ముందు చిట్ ఫండ్ లో చిట్టి వేసిన బాధితులు చిట్టి డబ్బులు ఇవ్వ‌డం లేదని ఆందోళ‌నలతో నిరసన చేపట్టారు. చిట్టి పూర్తయిన కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా 5 నెలల నుంచి తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్ ఫండ్ యజమానులు ఛీటింగులు చేస్తున్నార‌ని చిట్టి బాధితులు వాపోతున్నారు. ఈ చిట్టి వేసిన వారు దాదాపు 30 మంది లోకల్ వాళ్లేనని ఇంకా వివిధ గ్రామాల్లో ఇలా చిట్టీలు వేసిన వారు ఎంత మంది ఉన్నారోన‌ని విమర్శలు విపిస్తున్నాయి.

చిట్టి డబ్బుల పేరుతో చిట్ ఫండ్ యజమన్యం రియ‌ల్ ఎస్టేట్ చేస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నారన్నారు. వేసిన చిట్టి డబ్బులు అడిగితే భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని.. వారు చెప్పినట్టు వింటే సరే.. లేకుంటే మీ ఇష్టమున్న చోట చెప్పుకోండ‌ని అంటున్నారని బాధితులు అంటున్నారు. చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి ఇవ్వ‌కుండా నెలలు గడుస్తున్నా చిట్ ఫండ్ చుట్టూ తిరుగుతున్నామని డబ్బులు అడిగితే.. మా వెంచర్ ఉంది అందులో ప్లాట్ ఇస్తాం తీసుకో అంటున్నారు. అక్కడికి వెళ్తే ప్లాట్ లకు అనుమతులు లేని వాటిని చూపించి ఇదే అని చెప్తున్నారు. తాము వేసిన డబ్బులు త‌మకు ఇచ్చే వరకు ఇలానే నిరసనలు చేస్తామని బాధితులంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement