Saturday, May 4, 2024

Central Minister: రేపు తెలంగాణకు అమితాషా రాక

రేపు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు.

అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంట సమయంలో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో అమిత్ షా సమావేశం అవుతారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకొని అక్కడ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే మహిళా సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement