Wednesday, May 15, 2024

మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూత

అంబాల – కేంద్ర మాజీ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా (72) అనారోగ్యంతో కన్నుమూశారు. చండీగఢ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు.రతన్ లాల్ కటారియా 2019-21 మధ్య కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అంబాలా నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతి పట్ల హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ బుధవారం ఆసుపత్రికి వెళ్లి రతన్ లాల్ ను పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు. ఇవాళ ఉదయం రతన్ లాల్ కన్నుమూత వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.రతన్ లాల్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, రతన్ లాల్ కటారియా మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019-21 మధ్య కేంద్ర జల శక్తి, సామాజిక న్యాయ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement