Friday, April 26, 2024

కరీంనగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. వ్యవసాయ బావిలో పడ్డ కారు

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో ఓ కారు వ్యవసాయ బావిలో పడింది. బావిలో కారు పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో కారులోని నలుగురు గల్లంతయ్యారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలంలో హుస్నాబాద్ ఎస్సై చల్లా మధుకర్‌రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement