Monday, April 15, 2024

మహాసముద్రం మోషన్ పోస్టర్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..

అయితే తాజాగా మహాసముద్రం మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అజయ్ భూపతి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక మోషన్ పోస్టర్ చూస్తుంటే ప్రధాన పాత్రధారులు సీరియస్ లుక్స్, చైతన్య భరద్వాజ్ సంగీతం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement