Tuesday, May 14, 2024

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. ఇన్నోవా, స్విఫ్ట్ వేహికల్స్ సీజ్..

భూపాలపల్లి, ప్రభాన్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుండి నాలుగు క్వింటాళ్ల ఎండు గంజాయి, ఒక‌ ఇన్నోవా కారు, మారుతి షిఫ్ట్ వేహికిల్ ను సీజ్ చేశారు.

ప‌ట్టుప‌డ్డ గంజాయి విలువ దాదాపు రూ.80 లక్షలు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు పోలీసులు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని రిమాండ్ కి తరిలించారు. మ‌రో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement