Monday, April 29, 2024

Breaking: టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైసీపీ శ్రేణులు

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సొంత నియోగకవర్గం అయిన గుంటూరు జిల్లా పట్టిపాడులో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయనను జీజీహెచ్‌కు తరలించారు. బోయపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

వైసీపీ శ్రేణులు మద్యం మత్తులో చంద్రబాబును దూషించడంతో అక్కడే ఉన్న వెంకటనారాయణ వారిని అడ్డుకున్నాడు. దీంతో వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement