Wednesday, May 15, 2024

విద్యుత్ షాక్ తో కానిస్టేబుల్ దుర్మ‌ర‌ణం…

ములుగు : సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ ప్రమాదవాశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు.. ఈ ఘటన ములుగు జిల్లా శ్రీరామ్ న‌గ‌ర్ గ్రామంలోలో చోటు చేసుకుంది.. వివ‌రాల‌లోకి వెళితే శ్రీరామ్‌నగర్‌ గ్రామానికి చెందిన తాటి మహేందర్‌ (30) అరుణాచల్‌ప్రదేశ్ లో ఇండో టిబెటియన్ బోర్డర్‌ పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంటిలోని కూలర్‌లో నీళ్లు పోస్తుండగా విద్యుత్‌ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, మూడునెలల బాబు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement