Saturday, May 18, 2024

వైద్యారోగ్య పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం..

తాడేపల్లి: వైద్యారోగ్య పోస్టుల భ‌ర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి తోటు మ‌రో 42 అంశాల‌కు కెబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాల‌ని వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ను ఒకే చేసింది. ఈ నెల 27న అమ్మ ఒడి నిధులకు, జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఇందుకోసం రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు చేప‌ట్టేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయాల కౌలు భూముల పరిరక్షణకు చర్యలు, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరు చేశారు. అలాగే అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement