Saturday, April 27, 2024

నిద్రిస్తుండగా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్..

నిద్రుస్తున్న ఓ మహిళపై బెంగుళూరులో ఓ క్యాబ్ డ్రైవ‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అయితే ఆ మ‌హిళ‌ను రేప్ చేయ‌డానికి ముందు ఆమెతో ఆ డ్రైవ‌ర్ త‌న ఫోన్‌లో సెల్ఫీ దిగాడు. ఏపీకి చెందిన మ‌హిళ త‌న ఫ్రెండ్ ఇంటి నుంచి త‌న ఇంటికి వెళ్లేందుకు తెల్ల‌వారుజామున 3.20 నిమిషాల‌కు క్యాబ్ బుక్ చేసుకున్న‌ది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఆమె ఆ క్యాబ్‌లో త‌న ఇంటికి 3.40 నిమిషాల‌కు చేరుకున్న‌ది. కానీ ఈ లోపే ఆ మ‌హిళ క్యాబ్‌లోనే నిద్ర‌లోకి జారుకున్న‌ది. అయితే ఆ మ‌హిళ ఇళ్లు స‌మీపించిన త‌ర్వాత‌.. క్యాబ్ డ్రైవ‌ర్ డోర్ తీసేందుకు కారు వెనుక సీటుకు వ‌చ్చి చూశాడు. ఆ మ‌హిళ నిద్ర‌పోవ‌డాన్ని గ‌మ‌నించిన ఆ డ్రైవ‌ర్‌.. నిర్జ‌న‌ ప్ర‌దేశానికి త‌న కారును తీసుకువెళ్లి ఆమెతో సెల్ఫీ దిగాడు. ఆ త‌ర్వాత అత్యాచారం చేశాడు. నిద్ర మ‌త్తు నుంచి తేరుకున్న ఆ మ‌హిళ .. క్యాబ్ డ్రైవ‌ర్‌ను తోసి వేసి ప‌రుగులు తీసింది. క్యాబ్ డ్రైవ‌ర్ ఫోన్‌ను కూడా ఆ మ‌హిళ ప‌ట్టుకువెళ్లింది. ఆ ఫోన్‌ను ఆమె పోలీసుల‌కు అప్ప‌గించింది. ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథ‌మిక విచార‌ణ ప్ర‌కారం.. లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మెడిక‌ల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు నిందితుడు పోలీసుల‌కు చెప్పాడు.

ఇది కూడా చదవండి: పేపర్ బాయ్ మాటలకు కేటీఆర్ ఫిదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement