Tuesday, April 30, 2024

Brutality – పెళ్లికి నిరాక‌రించింద‌ని న‌డిరోడ్డుపై న‌రికేశాడు…

ఖానాపూర్ ఫిబ్రవరి 8 (ప్రభా న్యూస్) నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని శివాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై శ్రీకాంత్ త‌న ప్రియురాలు గొడ్డలితో దాడి చేశాడు..దీంతొ ఆ యువతి స్పాట్‌లోని ప్రాణాలు విడిచింది. అదేవిధంగా అలేఖ్యపై దాడి చేస్తుండగా.. అడ్డొచ్చిన ఆమె వదిన, మూడేళ్ల కుమారడిపై కూడా ప్రేమోన్మాది శ్రీకాంత్ దాడికి దిగాడు. దీంతో తల్లీ, కొడుకుకు గాయాలయ్యాయి. అనంతరం నిందితడు అక్కడ నుంచి పరారయ్యాడు.

ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అలేఖ్య ను అదే కాలనీలో నివసిస్తున్న శ్రీకాంత్ తో ప్రేమికులు… అయిత అలేఖ్య‌కు త‌ల్లిదండ్రులు మరొకరితో వివాహం నిశ్చ‌యించారు.. దీంతో ఆమెపై గొడ్డ‌లితో దాడి చేసి చంపివేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అలేఖ్య శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పంచునామా నిర్వహించారు ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన‌ చికిత్స కొరకు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తప్పించుకొని పారిపోయిన నిందితుడు శ్రీకాంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement