Sunday, April 28, 2024

AP: బాపట్ల జిల్లాలో యువకుడి దారుణ హత్య

బాపట్ల జిల్లా రేపల్లె అరవపల్లి శివారు క్రైస్తవ స్మశాన వాటికలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణారహితంగా మరో యువకుడు పొడిచి చంపాడు. మృతిచెందిన యువకుడు 24వ వార్డు నివాసి మేక సాయి (24)గా గుర్తించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న బ్లేడ్ హర్షగా పోలీసులు కనుగొన్నారు. మృతుడు సాయి నగరం ఎస్ వి ఆర్ ఎం కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

హత్య చేసిన యువకుడు విజయవాడలో నగర బహిష్కరణ గావించబడిన వ్యక్తిగా అనుమానం.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement