Thursday, April 25, 2024

Rajahmundry: ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తో బ్ర‌ద‌ర్ అనిల్ భేటీ

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన‌ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. రాజ‌మండ్రిలో భేటీ అయిన వీరు ప‌లు అంశాల‌పై కాసేపు ముచ్చటించారు. బ్రదర్ అనిల్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మర్యాద పూర్వకంగానే కలిశానని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పారు. అయితే తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఉండ‌వ‌ల్లి, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement