Sunday, May 5, 2024

Breaking : విశాఖ‌లోని ప‌లు ప్రాంతాల్లో భూకంపం..రిక్ట‌ర్ స్కేల్ పై1.8గా న‌మోదు..

విశాఖ‌ప‌ట్నంలో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. రిక్ట‌ర్ స్కేల్ పై తీవ్ర‌త 1.8గా న‌మోద‌యింది. కాగా భ‌యంతో ఇళ్ల నుంచి జ‌నం బ‌య‌టికి ప‌రుగులు తీశారు. ముర‌ళీన‌గ‌ర్,బీచ్ రోడ్డు,కంచ‌ర‌పాలెంలో భూమి కంపించింది. అక్క‌య్య‌పాలెం,మ‌ధురాన‌గ‌ర్,తాడిచెట్ల‌పాలెంలోనూ భూప్ర‌కంన‌లు వ‌చ్చాయి. పాత డెయిరీ ఫారం, బాలయ్య శాస్త్రి లేఔట్, కంచరపాలెం సింహాచలం తదితర ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల 13 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్టు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా నగరవాసులు, అపార్ట్మెంట్ వాసులకు ఆందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement