Saturday, May 4, 2024

Breaking : ఆమదాలవలసలో రైలు కిందపడి ఇద్దరు మృతి..

రైలు కింద ప‌డి ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే స్టేషన్(శ్రీకాకుళం రోడ్)లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ పై ప‌డి ఉన్న మృత‌దేహాల‌ను గుర్తించిన పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి ప‌లు వివ‌రాలు సేక‌రించారు. అయితే వీరు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. శనివారం అర్ధరాత్రి తరువాత రైలు లేదా గూడ్స్ కింద పడి మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరు ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారా? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అన్నది కూడా తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement