భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈనెల 8న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటన్లో అర్ధశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆమె అంత్యక్రియలు వెస్ట్మినిస్టర్లోని అబ్బేలో సోమవారం జరుగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement