Friday, April 26, 2024

Breaking : కీసర ఓఆర్‌ఆర్‌పై రెండు కార్లు ఢీ.. ఇద్ద‌రు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న మేడ్చల్‌ జిల్లా కీసర అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌ సర్కిల్‌ సమీపంలో ఘట్‌కేసర్‌ నుంచి వస్తున్న బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా మీర్‌పేట్‌ నుంచి వస్తున్న టాటా విస్టాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement