Thursday, May 2, 2024

Breaking : అస్వ‌స్థ‌త‌కి గుర‌యిన ప‌వ‌న్ క‌ల్యాణ్- త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తోన్న ఫ్యాన్స్

2024సార్వ‌త్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నారు ప‌వ‌ర్ స్టార్ ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ..కాగా ఆయ‌న అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. రాజకీయంగా బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గుర‌య్యార‌ట‌. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. పలు బహిరంగ సభలు, రోడ్ షోస్ లో పాల్గొన్న పవన్ వర్షంలో తడిసిన కారణంగా జ్వరం బారిన పడ్డారని సమాచారం. అలాగే ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారట. ఓ అభిమాని ఆయన మీద పడడంతో ఆయన వెన్నునొప్పికి గురయ్యారట. డాక్టర్స్ సలహా మేరకు పవన్ కళ్యాణ్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు పవన్ ప్రకటించిన చిత్రాలతో పాటు సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ సందిగ్ధంలో పడ్డాయి. పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టిన పవన్ షూటింగ్స్ మొత్తం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు కేవలం 20 నెలల సమయం మాత్రమే ఉండగా సంస్థాగతంగా జనసేన పార్టీని బలోపేతం చేయాలని ప‌వ‌న్ క‌ల్యాణ్ చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement