Saturday, April 20, 2024

రైలు ఢీకొని జవాన్‌ మృతి

రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొనడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ మరణించాడు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2001లో బీఎస్‌ఎఫ్‌లో చేరిన జవాన్‌ వీర్‌ సింగ్‌ ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల సెలవుపై హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చాడు. సోమవారం తన సోదరిని కలిసేందుకు ఆమె నివాసం ఉంటున్న మజ్రా ఖుర్ద్ గ్రామానికి వెళ్తున్నాడు. కాగా, క్రాసింగ్‌ వద్ద వీర్‌ సింగ్‌ రైలు పట్టాలు దాటుతుండగా రేవారి వైపు నుంచి వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీ కొట్టింది. పోస్ట్‌మార్టం కోసం మహేంద్రగఢ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement