Friday, May 17, 2024

HYD: ఎన్నికల వేళ భారీగా పట్టుబడ్డ మద్యం..

ఎన్నికల వేళ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది. తాజాగా దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.

సైబరాబాద్ సీపీ నిర్ధిష్టమైన సూచనల మేరకు సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఎస్‌వోటీ పోలీసులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబందితో కలిసి నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న రూ. 37 లక్షల విలువగల నాలుగు వేల లీటర్స్ మద్యం పోలీసులకు చిక్కింది. మొత్తం మూడు ప్రాంతాల్లో మద్యంతో పాటు నగదును పోలీసులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement