శ్రీశైల క్షేత్రంలో సెప్టెంబరు 26 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి . ఈ సందర్భంగా శుక్రవారం శాససనభలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ని కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు రాష్ట్ర దేవదాయశాఖ, ఉపముఖ్యమంత్రి.. మంత్రి కొట్టు సత్యనారాయణ , శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి , దేవదాయశాఖ కమిషనర్ డా . ఎం . హరిజవహర్లాల్ , దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి , ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ . లవన్న , ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు ఉమామహేష్ , మేరాజోత్ హనుమంత్నాయక్ , ఓ.మధుసూదన్ రెడ్డి తదితరులు. ఈ కార్యక్రమములో ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు , ప్రసాదాలు , శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement