Friday, May 17, 2024

200అడుగుల బోరు బావిలో ప‌డిన రెండేళ్ల బాలిక‌- ప్రాణాల‌తో ర‌క్షించిన అధికారులు

రెండేళ్ల చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తు 200అడుగుల బోరుబావిలో ప‌డిపోయింది. ఈ ఘటన రాజస్థాన్​ లోని దౌసా జిల్లా జస్సాపడ మండ‌లంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అభనేరి గ్రామంలోని దేవ్‌నారాయణ్ గుర్జర్ రెండేళ్ల కుమార్తె అంకిత ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంటి పక్కనే తెరిచి ఉన్న బోరుబావిలో పడింది. కొంత కాలంగా ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియలేదు. కొంతసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఇంతలో బోరుబావిలోంచి ఏడుపు వినిపించింది. బాలిక బోరుబావిలో పడిందన్న సమాచారం అందిన వెంటనే కలకలం రేగింది. స్థానికులు వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాలో బాలిక దాదాపు 100 అడుగుల లోతులో ఇరుక్కుపోయి కనిపించింది. జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లను పంపించి సహాయక చర్యలు చేపట్టారు. మ‌రోవైపు ఆ చిన్నారికి ఆక్సిజన్ అందజేశారు. బాలికను రక్షించే పనిలో ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బంది, పరిపాలన బృందాలు తీవ్రంగా శ్ర‌మించాయి. 7 గంటలకు పైగా శ్రమించి అధికారులు ఆ చిన్నారిని సుర‌క్షితంగా కాపాడి.. బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement