Friday, April 26, 2024

Breaking : మెడికో తపస్వి హత్య కేసుపై కొనసాగుతున్న విచారణ

గుంటూరు : మెడికో తపస్వి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో జీజీహెచ్‌లో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ముంబై నుంచి తపస్వి తల్లిదండ్రులు గుంటూరు రానున్నారు. పెదకాకాని పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానేశ్వర్‌ని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి నుంచి సర్జికల్‌ బ్లేడ్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమను నిరాకరించినందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. తపస్వి స్నేహితురాలు విభా పరారీలో ఉన్నారు. స్నేహితురాలు విభా ఇంట్లోనే హత్య జరిగింది కాబట్టి విభాపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య తర్వాత కనిపించకుండా పోయిన విభా కోసం పోలీసులు గాలిస్తున్నారు. విభా దొరికితే మరిన్ని విషయాలు భయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement