Wednesday, May 15, 2024

Breaking : కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డం అసాధ్యం- గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర‌రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ల‌క్ష్యంతోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని విమ‌ర్శిస్తున్నార‌ని ఆమె అన్నారు. అయితే జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ ప్ర‌వేశించడం అసాధ్య‌మ‌ని ఆమె ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. త‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వంతో కొన‌సాగుతున్న దూరంపైనా త‌మిళిసై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను గ‌వ‌ర్న‌ర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించ‌డం లేద‌న్నారు. సీఎం కేసీఆర్ ఇటీవ‌లే రాజ్ భ‌వ‌న్ వ‌చ్చి వెళ్లాక కూడా త‌న ప్రోటోకాల్‌లో ఎలాంటి మార్పు లేద‌ని తెలిపారు. మొన్న భ‌ద్రాచ‌లం వెళ్లినా అధికారులు ఎవ‌రూ రాలేద‌న్నారు. త‌న‌ను ఇత‌ర రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు, వారికి ద‌క్కుతున్న ప్రోటోకాల్‌తో పోల్చుకోన‌ని కూడా ఆమె తెలిపారు. ప్ర‌జ‌ల‌కు దగ్గ‌ర‌గా ఉండ‌ట‌మే త‌న నైజ‌మ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement