Thursday, May 9, 2024

Breaking: ఐఫోన్ త‌యారీ సంస్థ ఫాక్స్‌కాన్ సిబ్బందికి ఫుడ్ పాయిజ‌న్‌.. హాస్పిట‌ల్‌లో చేరిక‌..

స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం ఆపిల్ సంస్థ‌ కోసం ఐఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్ ఇండియా యూనిట్‌లో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది. దీంతో ఈ కంపెనీలో ప‌నిచేస్తున్న పలువురు ఉద్యోగులు శనివారం ఆస్ప‌త్రిలో చేరారు. ‘‘ఇవ్వాల‌ ఫాక్స్‌కాన్ డార్మిటరీలలో ఫుడ్ పాయిజనింగ్ జ‌రిగింది. ఇక్కడ ఎక్కువ మంది సిబ్బంది నివసిస్తున్నారు’’ అని అక్క‌డ ప‌నిచేసే ఓ ఉద్యోగి తెలిపారు.

కాగా, తైవాన్ మేడ్ అయిన‌ ఈ కంపెనీలో ఎక్కువ మంది మ‌హిళ‌లే ఉండ‌డం గ‌మనార్హం. అయితే.. వీరిలో ఎంత మంది వ‌ర్క‌ర్స్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనేది మాత్రం తెలియ‌డం లేదు. ఈ ఘటన దక్షిణ చెన్నై నగర శివార్లలోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తికి అంతరాయం క‌లిగించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement