Friday, May 17, 2024

హైద‌రాబాద్ లో ఐఏఎంసీ ప్రారంభించ‌డం సంతోషం : జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐఏఎంసీ ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు. న‌గ‌రంలోని నానక్‌రామ్‌గూడ లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖర్ రావు క‌లిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడుతూ… అన్ని ర‌కాల కేసుల్లో ఐఏఎంసీ మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని ప్రోత్స‌హిస్తుందన్నారు. అతి త‌క్కువ వ్య‌యంతో స్వ‌ల్ప స‌మ‌యంలో కేసుల‌ ప‌రిష్కార‌మే ఐఏఎంసీ ల‌క్ష్య‌మ‌న్నారు. ఐఏఎంసీ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని పేర్కొన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైద‌రాబాద్ అన్ని విధాలా అనుకూలంగా ఉంద‌న్నారు. ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తానికి హైద‌రాబాద్ వార‌ధి లాంటిద‌ని తెలిపారు. దేశంలో ఆర్బిట్రేష‌న్, మీడియేష‌న్ ప్ర‌క్రియ‌కు సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌న్నారు. ఆర్బిట్రేష‌న్, మీడియేష‌న్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాముఖ్య‌త ఉంద‌న్నారు. రాజీ, మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర పోషిస్తుంద‌న్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఐఏఎంసీ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల స‌ల‌హాలు అందుబాటులో ఉంటాయన్నారు. వివాదాల ప‌రిష్కారంలో జాప్యం జ‌రిగితే న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. ఇరుప‌క్షాల అంగీకారంతో త్వ‌రిత‌గ‌తిన కేసులను ప‌రిష్కారం చేయొచ్చని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement