Monday, April 29, 2024

Breaking : పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు..

పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పాతబస్తీలో సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.30 లక్షల నకిలీ కరెన్సీతో పాటు ప్రింటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? ఎంత మొత్తం ఇప్పటి వరకు తయారు చేశారు? అదేవిధంగా మీ గ్యాంగ్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారు? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement