Sunday, April 28, 2024

Breaking : అదుపుతప్పి బైక్‌ బోల్తా.. ఇద్దరు మృతి..

అదుపుతప్పి బైక్‌ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం దివిలిలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బైక్‌ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతులు సతీష్‌(22), దుర్గాప్రసాద్‌(22) గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement