Friday, May 17, 2024

Breaking : బ‌ద్వేలులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం..హైద‌రాబాద్ లో ఆచూకీ..

క‌డ‌ప : బద్వేలులో ముగ్గురు 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు అదృశ్యం.నిన్న స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు ఇంటికి తిరిగిరాలేదు..దాంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు బ‌ద్వేలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా ఆ ముగ్గురు విద్యార్థుల‌ను పోలీసులు హైద‌రాబాద్ లో గుర్తించారు. విద్యార్థులు హైద‌రాబాద్ ఎందుకు వ‌చ్చారు..ఎవ‌రైనా తీసుకువ‌చ్చారా అనే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement