Saturday, April 27, 2024

Maharastra | శివసేన తీర్ధం పుచ్చుకున్న‌ బాలీవుడ్ నటుడు..

ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (గురువారం) గోవిందకు శివసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం షిండేతో గోవింద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో ఈ సీనియర్ నటుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ ఈరోజు గోవింద షెండే పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ.. తాను మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానన్నారు. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై మరింత సుందరంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement