Wednesday, May 1, 2024

శ్రీశైలం నిత్యాన్నదాన సత్రంలో పేలిన బాయిలర్‌..

శ్రీశైలం : శ్రీశైలం నిత్య అన్నదాన సముదాయం భవనంలో శనివారం భారీ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అన్నదాన సత్రంలో భోజన సదుపాయాలు సిద్ధం చేస్తుండగా వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలిపోయింది. అన్నం వండేందుకు ముందుగా వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ చేస్తారు. ఈ స‌మ‌యంలో బాయిలర్ పేలిపోవడంతో అందులోని వేడి నీళ్లు అక్క‌డ ప‌నిచేస్తున్న వారిపై పడటంతో ఐదురికి తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే వారిని దేవస్థానం హాస్పటల్ కు తరలించి వైద్యం అందజేశారు. గతంలో కూడా అన్నదాన సత్రంలో బాయిలర్ పేలిన సంగతి విధితమే. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయ‌ని స్థానికులు అంటున్నారు. ఒకరి పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన గుంటూరు ఆస్ప‌త్రికి తరలించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య అన్నదాన భవనంలో జరిగే వంటలు చేసేందుకు ప్రతి సంవత్సరం ముక్కంటి బృందం విజయవాడ నుండి శ్రీశైలం వ‌స్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement