Tuesday, May 21, 2024

అమెరికాలో పడవ ప్రమాదం.. వేములవాడ యువకుని మృతి

వేములవాడ : వేములవాడ పట్టణానికి చెందిన కంటే యశ్వంత్‌ అనే యువకుడు అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ పడవ ప్రమాదంలో మరణించినట్లు మృతుని బంధువుల ద్వారా తెలిసింది. పట్టణంలోని సుభాష్‌ నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న మల్లయ్య అనే ప్రభుత్వ ఉపాధ్యాయిని కుమారుడు యశ్వంత్‌ గత కొన్ని నెలల కింద‌ట మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఎలక్ట్రానిక్స్‌లో మంచి ప్రతిభ కనబరుస్తూ, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మృత్యువాత పడడంతో మృతుని కుటుబంలో రోదనలు మిన్నంటాయి. రెండు రోజులు సెలవులు రావడంతో మిత్రులతో కలిసి సముద్రం వద్ద బీచ్ కు సరదాగా వెళ్ల‌గా.. ప‌డ‌వ అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావ‌డంతో యశ్వంత్‌ మృతి చెందినట్లు అమెరికా మిత్రుల ద్వారా తెలిసింది. యశ్వంత్‌ మరణ వార్తతో వేములవాడ పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement