Wednesday, May 8, 2024

బిజెపివి బ్యాక్ డోర్ పాలిటిక్స్- మునుగోడులో విజ‌యం మాదే- ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వ‌చ్చినా టీఆర్ ఎస్ దే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. దేశ స్వాతంత్ర్య దినోత్సవాల వజ్రోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ లో వన మహోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. కాగా మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీలో చేరబోతున్నారు. కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ..మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా… అభివృద్ధి ఆగలేదని చెప్పారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement