Sunday, April 28, 2024

National : సందేశ్ ఖాలీ బాధితురాలికి బిజెపి ఎంపి టిక్కెట్

పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి సందేశీఖాలీ బాధితురాలికి బీజేపీ టికెట్ ఇచ్చింది. చాలా రోజులుగా చర్చలో ఉన్న సందేశఖలీ ఈ నియోజకవర్గంకిందకే వస్తుంది. టీఎంసీ నేత షాజహాన్ షేక్ చేష్టలను బయటపెట్టిన మహిళల్లో రేఖా పాత్ర ఒకరు.. సందేశ్‌ఖాలీ ఉద్యమానికి ఆమె ప్రధాన పాత్ర పోషించారు.

షాజహాన్ తన భూమిని ఆక్రమించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రేఖా పాత్ర ఆరోపించింది. ఈ విషయంపై జాతీయ స్థాయిలో వెళ్లడంతో షాజహాన్ షేక్‌ను టిఎంసి పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందికి పైగా అరెస్టు అయ్యారు.

కాగా, షాజ‌హాన్ అక్ర‌మాలు వెలుగులోకి తెచ్చిన రేఖ‌కు క‌మ‌ల‌నాధులు అడ‌గ‌కుండానే లోక్ స‌భ టిక్కెట్ ఇచ్చారు.. ఇక బీజేపీ టికెట్ లభించిన అనంతరం రేఖ పాత్ర ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. తాను ఎల్లవేళలా గ్రామంలోని మహిళలకు అండగా ఉంటానని అన్నారు. బసిర్‌హత్‌తో పాటు సందేశ్‌ఖాలీ ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీ నాకు కల్పించిందని ఆమె తెలిపారు. బీజేపీ సందేశ్‌ఖాలీలో ఆనంద వాతావరణం నెలకొందన్నారు. తాను ఫిర్యాదు చేయడంతో షేక్ షాజహాన్, శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement