Sunday, April 28, 2024

మార్పు కోసం ఒక్క అవకాశం.. తిరుపతిలో దుబ్బాక సీన్

దుబ్బాక ఫలితాన్ని తిరుపతిలోనూ పునరావృతం చేస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రత్నప్రభకు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. దుబ్బాక ఫలితాన్నే తిరుపతిలో రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా విస్మరించాయని చెప్పారు. వైసీపీ తరహాలోనే దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ గురించి సవాళ్లు విసిరి భంగపడిందని గుర్తు చేశారు. వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ ఇంత వరకు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీయిజం, కబ్జాలు, అన్యమత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్పు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement