Tuesday, April 30, 2024

జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతోన్న బండిసంజ‌య్..

రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు బండిసంజ‌య్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ద‌మ‌వుతున్నారు..నేడు నల్గొండ, రేపు సూర్యాపేట జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. నేడు ఆయన నల్గొండ రూరల్ మండలం అర్జాలబావి ఐకేపీ సెంటర్ ను పరిశీలించనున్నారు. మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి రైతులను కలవనున్నారు. మార్కెట్ లో ధాన్నాన్ని అమ్మడంలో ఎదురవుతున్న సమస్యలు, ధాన్యానికి కనీస మద్దతు ధర, రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఈ రాత్రికి సూర్యాపేటలో ఆయన బస చేస్తారు. రేపు తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో ఆయన పర్యటిస్తారు.రైతులు పండించిన ధాన్యాన్ని కొనే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరాటానికి సిద్ధమయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement