Saturday, May 18, 2024

ఏపీలో జ‌న‌సేన‌తోనే బీజేపీ పొత్తు : బీజేపీ నేత లక్ష్మణ్

ఏపీలో తమకు జనసేన పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో పొత్తు లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాదులో మీడియాతో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ఆలోచ బీజేపీకి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీలో అభివృద్ధి కుంటుబ‌డింద‌ని ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ బీజేపీదే అధికారం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపైనా లక్ష్మణ్ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కొత్త పార్టీని స్వాగతిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement