Sunday, May 19, 2024

యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ దంప‌తుల‌ ప్రత్యేక పూజలు

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సీఎం కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ తన కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. నారసింహునికి సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పుష్క‌రిణి ని సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. ద‌స‌రాకు కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది. సీఎంతో పాటు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీష్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement