అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆగస్టు ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మంగళవారం వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాల్లో అనేక పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతుల్లో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు జీరోగా ఉందని, జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు కొత్తగా చేరిన బాలబాలికల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో బుధవారంలోగా నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. అట్లు చేయని ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెలలో జరిగే రేషనలైజేషన్ కౌన్సెలింగ్ ఈనెల 28వ తేదీ రోలు ఆధారంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని తరగతుల పాఠశాలలు, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 10:30 లోపు విద్యార్థుల హాజరు మొబైల్ యాప్లో నమోదు చేయాలన్నారు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరుతోపాటుగా సదరు కొత్త యాప్లో అన్ని రకాల లీవులు నమోదు చేయాల్సి ఉంటు-ందని సూచనలు చేశారు. విద్యాశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది టీ-చర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తమ డేటా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు టీఐసీ డేటా ఆధారంగా జరుగుతాయని, కనుక అందరూ తమ డిజిగ్నేషన్స్, జాయినింగ్ తదితర అన్ని రకాల వివరాలు సరిగా ఉన్నాయా అనేది చూసుకుని అప్ టు- డేట్ చేసుకోవాలని సూచించారు.